- Advertisement -spot_img
HomeUncategorizedతిరుగు లేని నాని లైన్ - అప్: Nani movies lineup update

తిరుగు లేని నాని లైన్ – అప్: Nani movies lineup update

- Advertisement -spot_img

నాచ్యురల్ స్టార్ నాని గారు రెండు వరుస విజయాలతో టైర్ 1 హీరో గా అప్గ్రేడ్ అయ్యారు . దసరా , Hi నాన్న చిత్రాల విజయలతో ఆయన మంచి జోష్ మీద ఉన్నట్టు కనిపిస్తోంది. తన తదుపరి చిత్రాల లైన్ -అప్ ని చూస్తుంటే ఆయన ఎలాంటి జోష్ లో ఉన్నారో తెలుస్తోంది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ గారితో రెండొవ సారి సినిమా చేస్తున్నారు నానీ గారు. “సరిపోదా శనివారం” అనే చిత్రానికి సంబందించిన టైటిల్ టీజర్ విడుదల చేసారు. ఎస్ జె సూర్య , ప్రియాంకా మోహన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ చిత్రం నిర్మాణ దశలో ఉంది తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి డివివి దానయ్య గారు తన డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రం ఆగష్టు 15వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ గారు ఇదివరకు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి చిత్రాలకి దర్శకత్వం చేసారు. ఇప్పుడు సరిపోదా శనివారం తో మళ్ళీ నాని గారితోనే కలిసి పనిచేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేకపోగా, నాని గారి తదుపరి చిత్రాలు ఇవే అని సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ అవుతోంది. లోతుగా పరిశీలిస్తే అది నిజం అయ్యే అవకాశాలు లేకపోలేదు. తన సొంత బ్యానర్ లో శైలేష్ కొలను ని దర్శకుడిగా పరిచయం చేస్తూ “HIT” అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ మొదలు పెట్టారు. మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు, ఇప్పటికే రెండు భాగాలు విడుదల అయ్యి మంచి విజయాన్ని అందించాయి. నిర్మాతగా నాని గారు మంచి లాభాలనే చూసారు. ఇప్పుడు అదే సిరీస్ లో మూడోవ భాగంలో తను ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అడవి శేష్ గారు నటించిన HIT 2 చిత్రం చివర్లో ఆ విషయాన్నీ ధ్రువీకరించారు కూడా. ఆ చిత్రం కూడా ఈ సంవత్సరంలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, HIT 3 తరువాత ఆయన “బలగం” దర్శకుడు వేణు తో సినిమా ఒప్పుకున్నారని తెలుస్తోంది. బలగం లాగానే ఈ చిత్రం కూడా పూర్తిగా తెలంగాణ గ్రామీణ ధోరణిలో ఉండబోతోంది అని సమాచారం. మొత్తం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు కొత్త వార్త హల్చల్ చేస్తోంది. నిర్మాత డివివి దానయ్య గారి నిర్మాణం లో ప్రస్తుతం దర్శకుడు సుజీత్ ఒక చిత్రం దర్శకత్వం వహిస్తున్నారు. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం “OG”. ఈ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల అవుతుంది అని సమాచారం. ఆ చిత్రం తరువాత అదే బ్యానర్ లో నాని గారు సుజీత్ దర్శకత్వంలో చెయ్యబోతున్నారు అని ఇప్పుడు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది కానీ నిజయమయితే నానీ గారి లైన్ – అప్ నుంచి వరుసగా 4 విజయాలను ఆశించొచ్చు. ఇది ఇలా ఉంటే ఈ చిత్రాలకి తోడుగా ఇంకో మూడు చిత్రాల గురించి కూడా చర్చ జరుగుతోంది. తనకి విజయాన్ని అందించిన దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ నాని గారికోసం వెయిట్ చేస్తునట్టు తెలుస్తోంది, ఇంకొక చిత్రం కలిసి చెయ్యటానికి . అది అయ్యాక తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ఒక చిత్రం చెయ్యబోతున్నారు అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి, ఆ తరువాత మాటల మాంత్రికుడు గురూజీ త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మల్టీ స్టారర్ చేస్తారు అని ఒక వార్త ఉంది. తన లైన్ – అప్ కాకుండా నాని గారు దర్శకుడు నాగ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న “కల్కి 2898 AD” లో కృపాచార్య గా అతిధి పాత్ర చెయ్యబోతున్నారు అని తెలుస్తోంది. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో తేలీదు కానీ, వేచి చూడాలి మరి, ఈ లైన్ – అప్ ఎప్పుడు నిజమవుతుందో అని.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page