- Advertisement -spot_img
HomeMoviesవిరూపాక్ష దర్శకుడితో సై అంటున్న నాగ చైతన్య!

విరూపాక్ష దర్శకుడితో సై అంటున్న నాగ చైతన్య!

- Advertisement -spot_img

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో “తండేల్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కి గాను మంచి స్పందన వచ్చింది. విశాఖ సముద్ర తీరంలో చేపలు వేటకు వెళ్లే మత్యుకారుని పాత్ర పోషిస్తున్నాడు నాగచైతన్య. ఈ ఏడాది దసరా టార్గెట్ గా బరిలో దిగుతుంది ఈ చిత్రం. ఐతే ఈ చిత్రం పూర్తికాక ముందే నాగచైతన్య మనసు అప్పుడే తన తదుపరి చిత్రం వైపు మళ్లింది. విరూపాక్ష లాంటి సూపర్ హిట్ తీసిన కార్తీక్ వర్మ దండు తో నాగచైతన్య తన తర్వాత సినిమాని లాక్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు తన బ్యానర్ మీద నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కధకి పాన్-ఇండియన్ అప్పీల్ ఉన్నట్లు టాక్. తదుపరి సమాచారం వచ్చేంతవరుకు వేచిచూడాలి మరి. ఈ వార్త నిజమైతే ఇప్పుడు రాబోతున్న తండేల్ తో పాటుగా ఈ చిత్రం మీద కూడా ఆశలు పెట్టుకోవచ్చు అనిపిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page